రాఫెల్ కేసు : చోరీచేసిన దస్త్రాలను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణిస్తోందా ?
న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అవకతవకలు జరిగాయని అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
సాక్ష్యాలుగా
పరిగణిస్తారా
?
రాఫెల్
యుద్ధ
విమానాల
కొనుగోలుకు
సంబంధించి
సమాచార
హక్కు
చట్టం
ద్వారా
పిటిషనర్లు
సమాచారం
పొంది
..
సర్వోన్నత
న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు.
ఈ
కేసులో
కేంద్రం
రివ్యూ
పిటిషన్
వేసి
..
తన
వాదనను
వినిపించింది.
పిటిషనర్లు
జతచేసిన
దస్త్రాలు
జాతీయ
భద్రతా
సమాచారానికి
సంబంధించినదని
...
వీటిని
ప్రభుత్వ
అనుమతి
లేకుండా
ఎవరూ
చూడరాదని
ఇదివరకు
పేర్కొన్నది.
అంతేకాదు
వీటి
ఆధారంగా
కేసులను
కూడా
పరిశీలించరాదని,
అధికార
రహస్యాల
చట్టం
కింద
వాటిని
బహిర్గత
చేయడం,
ప్రచురించడం
నేరమని
తెలిపింది.
గత
నెల
24న
వాదోపవాదనలు
విన్న
సర్వోన్నత
న్యాయస్థానం
తీర్పును
ఏప్రిల్
10
వెలువరిస్తామని
స్పష్టంచేసింది.
ఏం
చెబుతుందో
?
మరో
24
గంటల్లో
తొలివిడత
పోలింగ్
జరుగుతోండగా
..
రాఫెల్
యుద్ధ
విమానాల
కొనుగోలుకు
సంబంధించి
సుప్రీంకోర్టు
తీర్పు
వెలువరించడం
ప్రాధాన్యం
సంతరించుకుంది.
ఇంతకీ
సమాచార
హక్కు
చట్టం
కింద
జతచేసిన
పత్రాలను
కోర్టు
అంగీకరిస్తోందా
?
లేదా
ప్రభుత్వ
వాదనతో
ఏకీభవిస్తోందా
తెలియాలంటే
మరికొద్ది
గంటలు
ఆగాల్సిందే.