వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయలలితను దోషిగా.. పిటిషన్ కొట్టివేత: కర్నాటకకు 'రూ.100 కోట్ల' షాక్
అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితను దోషిగా తేల్చాలన్న పిటిషన్పై కర్నాటక ప్రభుత్వానికి బుధవారం సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
చెన్నై/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితను దోషిగా తేల్చాలన్న పిటిషన్పై కర్నాటక ప్రభుత్వానికి బుధవారం సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జయను దోషిగా తేల్చాలన్న కర్నాటక పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
జస్టిస్ పీసీ ఘోష్, అమితావ రాయ్లతో కూడిన డివిజన్ బెంచ్ కన్నడ ప్రభుత్వం వేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ ఆర్డర్ కర్నాటకకు పెద్ద దెబ్బ. దీని వల్ల జయలలితపై వేసిన రూ.100 కోట్ల జరిమానాను కర్నాటక ప్రభుత్వం వసూలు చేసుకోలేదు.
ఆస్తుల కేసులో జరిమానాను వసూలు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసులో అప్పటికే వాదనలు పూర్తయి, తీర్పు రిజర్వ్లో ఉంచిన సమయంలో, మొదటి నిందితులు చనిపోయినప్పటికీ.. ఆర్డర్ను స్తంభింప చేయడం సరికాదని కర్నాటక ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
Comments
jayalalithaa supreme court karnataka disproportionate assets case జయలలిత సుప్రీం కోర్టు కర్నాటక అక్రమాస్తుల కేసు
English summary
The Supreme Court on Wednesday refused to declare Jayalalithaa a convict in the disproportionate assets case. A division bench comprising Justice P C Ghose and Amitava Roy rejected a review petition by Karnataka challenging her abatement in the DA case.
Story first published: Wednesday, April 5, 2017, 16:29 [IST]