జయలలిత మృతి కేసు విచారణ పై స్టే విధించిన సుప్రిం కోర్టు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వేసిన జస్టీస్ అరుముగస్వామి కమిటి దర్యాప్తుపై సుప్రిం కోర్టు స్టే విధించింది. జయలలిత చివరి రోజుల్లో చెన్నైలోని అపోలో హస్పిటల్స్ చికిత్స పోందుతూ మృతి చెందింది. దీంతో ఆమే మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆసుపత్రి లో ట్రీట్మెంట్ నేపథ్యంలో కూడ అసక్తికర అనుమానాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం అరుముగస్వామి కమిటిని నియమించింది.
అయితే ఆ కమిటి అపోలో ఆసుపత్రి డాక్టర్లను జయలలితకు ఇచ్చిన ట్రిట్మెంట్ కు సంబంధించి రికార్డులు అడుగుతూ సమన్స్ జారి చేసింది. దీనిపై ఆపోలో ఆసుపత్రి కోర్టుకు మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. కమిటిలో వైద్యపరమైన ఎక్స్ పర్ట్స్ లేరని పేర్కోంది. పిటిషన్ స్వికరించిన మద్రాస్ కోర్టు ఆసుపత్రి చెప్పిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. దీంతో సుప్రింకోర్టు వెళ్లడంతో నేడు కోర్టు కమిటి ఎంక్యయిరి పై స్టే విధించింది.