కేజ్రివాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: మీడియా సర్క్యూలర్పై స్టే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మీడియాకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని ఉన్నతన్యాయస్థానం ఎండగట్టింది.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తే హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవలే సర్క్యులర్ జారీ చేసింది.
కోర్టులో పరువునష్టం దావాలు వేయాలంటూ అధికారులు, మంత్రులకు కేజ్రీవాల్ సూచించారు. ఈ సర్క్యులర్కు వ్యతిరేకంగా పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మీడియాపై తన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా అంశంతో, మీడియాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కోరడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. తమ పార్టీని నాశనం చేసేందుకు మీడియా సుపారీ తీసుకుందని, మీడియా అమ్ముడుపోయిందంటూ గత వారం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.