లైంగిక వేధింపులు: బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్! హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఎంట్రీ
భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖీ కట్టించి బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ తీర్పుపై స్టే విధించేలా చూడాలని అటార్నీ జనరల్ను కోరింది.
బాధితురాలి బాధను చిన్నది చేస్తారా?
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉందని దేశంలోని 9 మంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసాధారణ పరిస్థితుల్లో అప్పీల్ దాఖలు చేసినట్లు న్యాయవాది అపర్ణ భట్ సహా పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ పరిఖ్.. ధర్మాసనంకు తెలిపారు. అటువంటి పరిస్థితుల వల్ల మహిళ బాధ చాలా చిన్నదిగా చేయబడిం
దేశంలోని అత్యున్నత న్యాయ అధికారి కార్యాలయానికి నోటీసులు
మీరు మధ్యప్రదేశ్ కోసం మాత్రమే సమర్పణ చేస్తున్నారా? లేదా మొత్తం దేశం కోసమా? అని ధర్మాసనం అడిగింది. దీనికి, పరీఖ్ బదిలిస్తూ.. మొత్తం దేశానికి సంబంధించి తాను సమర్పణ చేస్తున్నానని, పిటిషనర్లు హైకోర్టులు, ట్రయల్ కోర్టులతో సహా కోర్టులను ఇటువంటి పరిశీలనలు చేయకుండా నిరోధించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అత్యున్నత న్యాయ అధికారి కార్యాలయానికి నోటీసు ఇస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. ఈ విషయంపై నవంబర్ 2న విచారణ చేయనున్నట్లు వెల్లడించింది.
తీర్పులో అనేక అంశాలు, ప్రశ్నలు..?
బెయిల్ కోరుతున్న కేసులో కోర్టు నిందితులు, ఫిర్యాదుదారుల మధ్య కాంటాక్ట్ అనుమతించే అదనపు షరతులను విధించడం సముచితమా? అనే దానితో సహా చట్టంలోని గణనీయమైన ప్రశ్నలు ఈ విషయంలో ప్రమేయం ఉన్నాయని పిటిషన్ పేర్కొంది. పైన పేర్కొన్న బెయిల్ షరతు నేర న్యాయ వ్యవస్థలో విచారణలను నియంత్రించే సూత్రాలకు అనుగుణంగా ఉందా? ప్రశ్నించింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం పరిశీలన కోసం తలెత్తే చట్టంకు మరొక ప్రశ్న ఏమిటంటే.. ఒక మహిళపై లైంగిక నేరానికి పాల్పడిన కేసులో వ్యవహరించేటప్పుడు హైకోర్టు పరిపూర్ణత, సున్నితత్వాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందా? అని పేర్కొంది.
Recommended Video
బాధితురాలికి రాఖీ కట్టిన నిందితుడికి బెయిల్.. కానుకగా రూ. 11వేలు
కాగా, జులై 30 మధ్యప్రదేశ్ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. నిందితుడు, అతని భార్య ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలని, జీవితాంతం ఆమెకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, సాధారణ లైంగిక వేధింపుల కేసులలో నిందితుల నుంచి రాబట్టిన పరిహారాన్ని కోర్టులు బాధితులకు అందజేస్తాయి. కానీ, ఇక్కడ రాఖీ కట్టించుకున్న తర్వాత నిందితుడు ఇచ్చిన రూ. 11వేల మొత్తాన్ని బాధితురాలికి బలవంతంగా అంటగట్టారు.
ఇక ఈ కేసులో రెండో నిందితుడు రూ. 5వేలను బాధితురాలి సోదరుడికి ఇవ్వాలని బెయిల్ షరతులు ఆదేశించడం గమనార్హం.