వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెండింగ్ లో సెల్ఫీ విత్ తిలక్: బొట్టు, విభూది పెట్టుకున్న వాళ్లను చూస్తే చాలా భయం: మాజీ సీఎం

|
Google Oneindia TeluguNews

బాగల్ కోట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నుదుట పెద్ద బొట్టు పెట్టుకున్న వారిని చూస్తే.. తనకు చాలా భయం అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. హైందవాన్ని అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. హిందుత్వాన్ని కించపరిచేలా ఆయన కామెంట్స్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సెల్ఫీ విత్ తిలక్ అనే ఉద్యమాన్ని అప్పటికప్పుడు ఆరంభించింది బీజేపీ. ఆ హ్యాష్ ట్యాగ్ కాస్తా కొన్ని గంటల వ్యవధిలో ట్రెండింగ్ లో నిలిచింది.

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా బాదామిలో సిద్ధరామయ్య బుధవారం పర్యటించారు. కొన్ని అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బాదామి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. సభలో ప్రసంగిస్తున్న ఆయన తిలకధారులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు, విభూది పెట్టుకొనే వాళ్లంటే తనకు భయమని అన్నారు. చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టిన

‘Scared of people who wear tilak,’ says Karnataka former Siddaramaiah

కాంట్రాక్టర్ ఎవరని ప్రశ్నించగా సిద్ధరామయ్య ప్రశ్నించగా.. అధికారులు కాంట్రాక్టర్ ను చూపించారు. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించారు. ఆయనను చేసిన వెంటనే సిద్ధరామయ్య ''కుంకుమ బొట్లు పెట్టుకొనే వాళ్లంటే నాకు భయం'' అని వ్యాఖ్యానించారు. నిర్దేశిత సమయంలోగా చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

సిద్ధరామయ్య హిందువుల మనుభావాలు దెబ్బతీసేలా, హైందత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని అంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. గతంలో సిద్ధరామయ్య బొట్టు పెట్టుకున్న ఫొటోలను ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకున్న ఫొటోలను అప్ లోడ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి బగ్గా.. 'సెల్ఫీ విత్ తిలక్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొట్టుతో ఫొటోలు దిగి ట్వీట్ చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

English summary
Former Karnataka Chief Minister and senior Congress leader Siddaramaiah has waded into another controversy over his remarks about people who wear tilaks on their forehead. Speaking at an event in Badami to inaugurate a lake rejuvenation project on Tuesday, Siddaramaiah said he was “afraid of people who wear kumkum” on their forehead and questioned their ability to work. “I am scared of people who wear kumkum. You have to do the work well and finish it on time. I don’t know…I have this fear about people who wear such long tilaks on their forehead,” the Congress leader said amid peals of laughter from the crowd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X