స్కూల్ యూనీఫాంలో అమ్మాయిలు బీర్లు తాగి, చికెన్ తింటూ చిందులు, వీడియోలు వైరల్, పరీక్షలు !
చెన్నై/ అరియలూరు: స్కూల్ యూనీఫాం వేసుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలు జల్సాగా బీరు తాగి చిందులు వేశారు. స్కూల్ యూనీఫాంలో అమ్మాయిలు చిప్స్, స్నాక్స్, చికెన్ తింటూ బీరు తాగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. వచ్చే నెల మార్చిలో అమ్మాయిలకు పరీక్షలు జరుగుతున్నాయని, అందువలన ఆచీతూచి చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
ఎదురింటి ఆంటీతో బెడ్ రూంలో రొమాన్స్, పక్క గదిలో భర్త, నగ్నంగా చూసి ఇద్దర్నీ అడ్డంగా నరికేశాడు !
స్కూల్ యూనీఫాంలో అమ్మాయిలు
తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న ఐదు మంది అమ్మాయిలు ఇటీవల ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరారు. అయితే అమ్మాయిలు స్నేహితులతో కలిసి స్కూల్ కు వెళ్లకుండా ఎగనామం పెట్టారు. స్కూల్ అమ్మాయిలు అందరూ కలిసి ఓ చోట మీటింగ్ పెట్టారు.
బీర్ బాటిల్స్, చికెన్, చిప్స్
స్కూల్ కు వెళ్లకుండా నామం పెట్టిన అమ్మాయిలు బీర్ బాటిల్స్, చికెన్, చిప్స్ తో పాటు మందులోకి తినడానికి వివిద రకాల ఆహారపదార్థాలు తీసుకున్నారు. తరువాత ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అటవి ప్రాంతంలోని ఓ చోటకు వెళ్లారు. ఆ ప్రాంతానికి ఎవ్వరూ రారని స్కూల్ అమ్మాయిలు భావించారు.
బీర్ తాగుతూ ఎంజాయ్ చేశారు
యూనీఫాం వేసుకున్న స్కూల్ అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా దర్జాగా బీర్ బాటిల్స్ ఓపెన్ చేశారు. తరువాత బీరు గ్లాసుల్లోకి పోసుకున్నారు. తరువాత బీరు తాగుతూ పక్కన ఉన్న చికెన్, చిప్స్ తింటూ అమ్మాయిలు ఎంజాయ్ చేశారు. ఐదు మంది అమ్మాయిలు బీరు తాగుతున్న సమయంలో పక్కన మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
స్కూల్ అమ్మాయిలు బీరు తాగుతున్న సమయంలో పక్కనే ఉన్న వారి స్నేహితులు ఇద్దరు వీడియోలు తీశారు. తరువాత వీరు ఏదో దేశాన్ని ఉద్దరించారని అనుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అరియలూరు జిల్లా స్కూల్ అమ్మాయిలు యూనీఫాంలో బీరు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Recommended Video
అమ్మాయిలకు పరీక్షలు, ఫ్యామిలీలకు వార్నింగ్
స్కూల్ అమ్మాయిల బీరు తాగే ఎపిసోడ్ వీడియోలు వైరల్ కావడంతో విద్యాశాఖా అధికారులు సీరియస్ అయ్యారు. యూనీఫాంలో బీర్లు తాగుతున్న అమ్మాయిలు అరియలూరు ప్రభుత్వ స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నారని గుర్తించారు. మార్చి నెలలో స్కూల్ లో అమ్మాయిలకు పరీక్షలు జరుగుతున్నాయని, అందు వలన వారి మీద ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోమని, వారి కుటుంబ సభ్యులను పిలిపించి వార్నింగ్ ఇచ్చామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. యూనీఫాంలో బీర్లు తాగిన స్కూల్ అమ్మాయిల మీద పరీక్షలు పూర్తి అయిన వెంటనే చర్యలు తీసుకుంటామని తమిళనాడు విద్యాశాఖ అధికారులు, స్కూల్ యాజమాన్యం తెలిపింది.