దారుణం: స్కూల్ దగ్గరలోనే అమ్మాయి తల నరికేశాడు
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు కాస్త దూరంలో ఓ వ్యక్తి యువతిని కత్తితో నరికి చంపేశాడు. భోపాల్కు 540 కిలోమీటర్ల దూరంలోని అనుప్పూర్లో జరిగింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.
11వ తరగతి చదువుతున్న బాలిక బయోలజీ ప్రాక్టికల్ పరీక్షల కోసం గం.12.30కు స్కూల్కు హడావుడిగా వస్తోంది. ఆ సమయంలో ఒకతను కత్తితో ఆమె తలపై మూడుసార్లు దాడి చేశాడు.
ఆ తర్వాత అతను కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. స్కూల్ టౌన్కు బయట ఉంటుంది. అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు.
ఈ సంఘటనను దూరం నుంచి 63 ఏళ్ల ఓ టీచర్ చూశారు. కానీ కళ్లద్దాలు లేకపోవడంతో నిందితుడు ఎవరో స్పష్టంగా గుర్తించలేకపోయారు.
అయితే బాలికను కత్తితో నరుకుతున్నట్లుగా, ఆమె కిందపడినట్లుగా కనిపించింది. స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులు ఒకరిని అనుమానించడంతో పోలీసులు విచారించారు.