వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ...

|
Google Oneindia TeluguNews

ముంబై : భారీ వర్షాలతో ముంబై మహానగరం అల్లాడుతుంది. వరదనీరు చేరడంతో కాలనీలు నదులను తలపిస్తోన్నాయి. జనం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం కూడా వెళ్లలేని సిచుయేషన్ నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణుకుతుంది. దీంతో ముంబై, థానే, కొంకణ్ పరిసరాల్లో పాఠశాల, కళాశాలలకు సెలవు పర్కటించారు. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబైతోపాటు రాయిగఢ్ జిల్లాపై కూడా వర్షాలు ప్రభావం చూపుతాయని అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి కురిసే వర్షం దాదాపు 204 మిల్లీ మీటర్ల వర్షం నమోదవుతుందని అధికారులు అంచనావేశారు. దీంతో రెడ్ అలర్ట్ కూడా జారీచేశారు.

Schools and Junior Colleges Shut as Mumbai Gears Up for Extremely Heavy Rainfall

ముంబై శివారులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. దాదాపు 50 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడుగంటల్లో కురిసిన కుంభవృష్టితో శివారు ప్రాంతాలు జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. ముంబైలోని పల్గార్, థానే, రాయిగఢ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో రైళ్లు, విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది.

English summary
All schools and junior colleges were shut in Mumbai, Thane and the Konkan region for Thursday after the IMD forecast “extremely heavy rainfall” for the city and adjoining Raigad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X