ఆర్తనాదాలు, రక్తపు మరకలు, వణికిపోయిన చిన్నారులు, రన్ వేపై భీతావాహ దృశ్యాలు..
కోజికోడ్ విమాన ప్రమాదంతో రన్ వేపై భీతవాహ వాతావరణం నెలకొంది. ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలు కావడంతో పైలట్, కో పైలట్ సహా 19 మంది చనిపోయారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదం జరిగిన రన్ వే ఆరుపుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఎటుచూసిన రక్తపు మరకలు కనిపించాయి. ఆ సమయంలో చిన్నారులు భయపడి బోరున ఏడ్చేశారు. అంబులెన్స్ల రాకతో ఆ ప్రాంగణం సైరన్ల మోత వినిపించింది.
ఎయిరిండియా విమాన ప్రమాదం: అత్యంత వేగంగా రన్వేపైకి, వ్యాలీలో రెండు ముక్కలుగా..
విమాన ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో ఉన్న ప్రయాణికుల అరిచారు. విమానంలో కొందరు నాలుగు, ఐదేళ్ల చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వారు సీట్ల కింద ఇరుక్కుపోయారని.. వారిని తీయడానికి కష్టమైందని వివరించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు సమీపంలో గల ప్రజలు కూడా ముందుకొచ్చారు. తమ కార్లలో కోజికోడ్, మలప్పురంలో గల వివిధ ఆస్పత్రులకు తరలించారు. విమానం ల్యాండయిన సమయంలో పెద్ద శబ్దం విన్నానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
Recommended Video
రన్ వే పైకి వెళ్లేసరికి కొందరు పరిస్థితి విషమంగా ఉంది అని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. కొందరికీ కాళ్లు విరిగిపోయాయని.. మరికొందరికీ చేతులు, ఇతర చోట్ల గాయపడ్డారని తెలిపారు. వారిని కాపాడే సమయంలో తన చేతులు, షర్ట్ రక్తం నిండిపోయిందని తెలిపారు. విమానం నుంచి కాక్ పిట్ తీసిన తర్వాత.. పైలట్ను బయటకు తీశారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.