ఫ్రాన్స్ నుంచి నాన్స్టాప్గా..: భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే మొదటి శలో పలు రపేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రెండవ బ్యాచ్ రాఫెల్ ఫైట్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ నాన్ స్టాప్గా ఎగురుతూ వచ్చాయి. రెండో బ్యాచ్లో భాగంగా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానాలు భారత్కు చేరుకున్నాయి.
Recommended Video
ఫ్రాన్స్ నుంచి భారత్కు ఎక్కడా ఆగకుండా రావడం గమనార్హం. జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ ఎగురుతూ 7000-బేసి కిలోమీటర్లను కవర్ చేశాయని ఐఏఎఫ్ పోస్ట్ చేసింది.
ఈ అత్యాధుక యుద్ధ విమానాలు అంబాలలోని వైమానిక స్థావరంలో దిగినట్లు భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జులై 29న ఐదు రఫేల్ జెట్లు భారత్ కు రాగా, భారతదేశంలో రాత్రి 8.14 గంటలకు మరో మూడు జెట్లు చేరుకున్నాయి. 2023 నాటికి మొత్తం విమానాలు భారత్కు చేరతాయని తెలిపారు.
Second batch of IAF #Rafale aircraft arrived in India at 8:14 pm on 04 Nov 20 after flying non-stop from France.
— Indian Air Force (@IAF_MCC) November 4, 2020
మొత్తం రూ. 59వేల కోట్లతో 36 యుద్ధ విమానాల సరఫరాకు ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఐదు జెట్ల మొదటి బ్యాచ్ జూలై 29 న భారతదేశానికి చేరుకుంది. ఆ సమయంలో, జెట్లు ఆకాశంలోనే ఇంధనం నింపుకున్నాయి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు చేరడం శత్రుదేశాలైన చైనా, పాకిస్థాన్లకు దడపుడుతోంది.