బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలులో యువతుల ఫోటోలు తీస్తున్న క్రికెట్ స్టేడియం సెక్యూరిటీ గార్డు, చివరికి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు మెట్రో రైలులో ఒంటరిగా ఉంటున్న యువతుల ఫోటోలు తీసి దుర్వినియోగం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రామచంద్ర (30) అనే యువకుడిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు చెప్పారు.

ఒడిశా నుంచి బెంగళూరు చేరుకున్న రామచంద్ర నెలమంగళలో నివాసం ఉంటున్నాడు. క్రికెట్ స్టేడియంలో రామచంద్ర సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం మెజస్టిక్ నుంచి నాగమంగళకు మెట్రో రైలు బయలుదేరింది.

Security guard held for clicking womans photos at Bengaluru Metro station

మెట్రో రైలులో రామచంద్ర ప్రయాణించాడు. నాగమంగళ చివరి మెట్రో రైల్వే స్టేషన్. నాగమంగళ చివరి స్టాప్ కావడంతో ప్రయాణికులు చాల తక్కువ మంది ఉన్నారు. ఆ సందర్బంలో ఎదురుగా ఒంటరిగా కుర్చున్న యువతిని రామచంద్ర గమనించాడు.

రామచంద్ర మొబైల్ ఫోన్ లో యువతి ఫోటోలు తీశాడు. మొబైల్ నుంచి లైట్ ఫ్లాష్ కావడంతో యువతి గమనించింది. తన ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో దుర్వినియోగం చెయ్యడానికి ప్రయత్నించాడని యువతి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రామచంద్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
A 30-year-old security guard of a cricket stadium near Makali, off Tumakuru Road, was arrested on friday for allegedly clicking photos of a woman at Nagasandra Metro station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X