విద్యార్థి ఫోన్ నుంచి మహిళా లెక్చరర్లకు బూతు మెసేజ్లు: అరెస్ట్
మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ ద్వారా నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపించాడు. దీంతో, షాక్కు గురైన సదరు మహిళా లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆ సెల్ ఫోన్ ఓ విద్యార్థిదని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేలింది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
security guard arrest harassment women bengaluru mobile phone సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్ వేధింపులు మహిళలు బెంగళూరు
English summary
The Malleshwaram police have arrested a security guard of a private college for allegedly harassing women lecturers by sending them text messages from a mobile phone belonging to a college student.
Story first published: Saturday, January 28, 2017, 12:34 [IST]