వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కంటే కంగనా ఎక్కువైంది - దావూద్ ఆస్తుల్ని కూల్చేసే దమ్ముందా? : శివసేనపై బీజేపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే శివసన కూటమి సర్కారు ప్రాధాన్యం మాత్రం కరోనా కు కాకుండా కంగనా రనౌంత్ కే ఇస్తున్నట్లుగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, కంగనా ఇష్యూలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్‌దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్‌దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?

కరోనా విలయం..

కరోనా విలయం..

మహారాష్ట్రలో కేసుల సంఖ్య అక్షరాలా 10 లక్షలకు చేరువైంది. గడిచిన వారం రోజులుగా ఏనాడూ పాతిక వేలకు తగ్గకుండా కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పటికే కేసులు 9.90లక్షలు కాగా, శుక్రవారం నాటి బులిటెన్ లోనే మిలియన్ మార్క్ దాటనుంది. అంతేకాదు, కొవిడ్ మరణాల్లోనూ మహారాష్ట్ర ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇక్కడ కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 29వేలకు చేరువైంది. కరోనా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే శివసేన కూటమి సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదని ఫడ్నవిస్ మండిపడ్డారు.

సెక్స్ లో సుఖానుభూతి దైవిక‌మైన‌ది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాసెక్స్ లో సుఖానుభూతి దైవిక‌మైన‌ది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా

50 శాతం శ్రద్ధ పెట్టినా..

50 శాతం శ్రద్ధ పెట్టినా..

‘‘దేశంలో కరోనా వల్ల చనిపోయినవారిలో 40 శాతం మంది మహారాష్ట్రవాళ్లే. ప్రతిరోజూ 25 నుంచి 30వేల కొత్త కేసులు వస్తున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రంగా కొనసాగుతున్నాం. కానీ ఉద్ధవ్ ఠాక్రే సర్కారు మాత్రం కరోనాను వదిలేసి, కంగనాతో పోట్లాడుతోంది. ఆ విషయంలో చూపుతోన్న శ్రద్ధలో కనీసం 50 శాతం కరోనాపై పెట్టినా మహారాష్ట్రలో మరణాలు తగ్గి ఉండేవి'' అని ఫడ్నవిస్ అన్నారు.

దావూద్ బంగళా కూల్చుగలరా?

దావూద్ బంగళా కూల్చుగలరా?


శివసేన చేస్తోన్న అతికి నటి కంగనా రనౌత్ రియాక్షన్ మాత్రమే ఇస్తున్నారని, నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చడం ద్వారా ఆమెను భయపెట్టడానికే సేన ప్రయత్నం చేసిందని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ‘‘కంగనా రనౌత్ రాజకీయ నేత కాదు. అలాంటప్పుడు ఆమె కామెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వ్యవహారాన్ని ఇంత పెద్దది చేయడం శివసేనకు అవసరమా? అక్రమ కట్టడాలపై చర్యలంటే మరి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని, ఆస్తుల్ని కూడా కూల్చేయగలరా?'' అని ఫడ్నవిస్ సవాలు విసిరారు.

English summary
The Shiv Sena-led state government these days looks more focused on fighting actor Kangana Ranaut than the ongoing coronavirus crisis in Maharashtra, said BJP leader Devendra Fadnavis on Friday. "Kangana's issue was blown out of proportion by you (Shiv Sena). You don't go to demolish Dawood's home but you demolished her place," Fadnavis told reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X