వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో జర్నలిస్ట్: మొహాలిలో జేకె సింగ్ సహా అతని తల్లి హత్య..

గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ మొహాలిలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్దే దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

శనివారం మధ్యాహ్నం సింగ్‌ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఎంతకీ వారు తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి పరిశీలించారు.

Senior journalist K J Singh, 92-year-old mother found dead at their Mohali residence

ఇంట్లో సింగ్ అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. ఘటన తర్వాత సింగ్ కారు కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.

జేకె సింగ్ గతంలో 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఎడిటర్‌గా పనిచేశారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ జేకె సింగ్ హత్యను ఖండించారు. హంతకులను పోలీసులు తక్షణమే పట్టుకోవడానికి ప్రయత్నించాలన్నారు.

కాగా, కర్ణాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఇంకా మరిచిపోకముందే మరో జర్నలిస్ట్ ఇలా హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

English summary
Senior Journalist K J Singh and his 92-year-old mother were found dead at their residence in Mohali on Saturday in what seems like a robbery at the moment. Police investigation is underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X