మాజి అదనపు సోలిసిటర్ జనరల్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ఇంట్లో సీబిఐ సోదాలు
గత కొద్ది రోజులుగా పలువురు ప్రముఖుల ఇళ్లపై మూకుమ్మడి దాడులు కొనసాగిస్తున్న సిబిఐ తాజగా మాజీ సొలిసిటర్ జనరల్, సోనియాగాంధీ సన్నిహితురాలైన లాయర్ ఇందిరా జైసింగ్ కుటుంభంతో పాటు వారు నిర్వహించే ఎన్జీఓ కార్యలయాల్లో కూడ సీబిఐ సోదాలు నిర్వహించింది. కాగా విదేశీ ఫండింగ్ విషయంలో ఎఫ్సీఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సీబిఐ సోదాలు నిర్వహించినట్టు ప్రకటించింది.
ఆర్దిక నేరాల్లో చిక్కుకున్న పలువురిపై సీబిఐ దాడుల కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే విదేశీ ఫండింగ్ వ్యవహారల్లో అవకతవకలు జరిగాయనే అరోపణలు ఎదుర్కోంటున్న ప్రముఖ అడ్వకేట్ ,మాజీ సోలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్తోపాటు ఆమే భర్త ఆనంద్ గ్రోవర్ల కార్యాలయాల్లో ఉదయం అయిదు గంటలకే తనిఖీలు చేశారు.
కాగా ఆనంద్ గ్రోవర్ నడిపై ఎన్జీవో లాయర్స్ కలెక్టివ్కు వచ్చిన విదేశీ విరాళాలను సుమారు 30 కోట్ల రుపాయాలను దుర్వినియోగం చేశారని ఆ నిధులను విదేశాల్లో ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్జీవో ప్రెసిడిండ్ ఆనంద్ గ్రోవర్పై సీబీఐ కేసు నమోదు చేసింది.ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిబిఐ సోదాలు చేసింది.కాగా ఇందిరా జైసింగ్ అదనపు సోలిసిటర్ జనరల్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చేయడంతో పాటు సోనియాగాంధీకి సన్నిహితురాలు కూడ.