విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..
రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం సాయంత్రం చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. మేఘవాల్ మృతిపై సీఎం అశోక్ గెహ్లట్ సంతాపం వ్యక్తం చేశారు. తన సహచరుడు చనిపోయాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యానని గెహ్లట్ తెలిపారు. అతనితో 1980 నుంచి కలిసి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. అతని కుటుంబసభ్యులకు గెహ్లట్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ భగవంతుడికి వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు.
భన్వార్ లాల్ చురు జిల్లా సుజన్గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు భనరసీ దేవి కూడా చనిపోయారు. గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇంతలోనే భన్వారిలాల్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్దికాలంలో ఇద్దరూ చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.