వరుస అత్యాచారాలకు పాల్పడ్డాడు....జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు
మైనర్ బాలికలపై వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్న రాథేశ్యం అనే వ్యక్తికి మద్యప్రదేశ్ లోని ఓ కోర్టు యావజ్జీవ ఖైదీ విధిస్తూ తీర్పు చెప్పింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనంద్ నగర్ కు చెందిన రాథేశ్యాం 2015
భోపాల్ :కామంతో కళ్ళుమూసుకుపోయి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.మద్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనండ్ నగర్ కు చెందిన రాధేశ్యం మీనాకు 36 ఏళ్ళ వయస్సు.మైనర్ బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. వరుసగా ముగ్గురి బాలికలు రాధేశ్యాం చేతిలో బలయ్యారు.
2015 నవంబర్ 26వ, తేదిన పిప్లానీ అనే ప్రాంతంలో బిస్కెట్లు ఇస్తానని చెప్పి 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు ఆశ్లీల వీడియో చూపించాడు. మద్యం తాగించాడు .ఆ తర్వాత రేప్ చేశాడు. ఈ ఘటన మరువకముందే మరో ఘటనకు పాల్పడ్డాడు.
2016 జనవరి 14వ, తేదిన 11 ఏళ్ళ బాలికను రేప్ చేశాడు.ఈ ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత మార్చి 23 వ, తేదిన 9 ఏళ్ళ బాలికను కూడ లైంగికంగా వేధించాడు. ఈ బాలికల నగ్నచిత్రాలు తీశాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రాధేశ్యామ్ కు జిల్లా జడ్జి పాలివాల్ యావజ్జీవ శిక్ష విధించారు.