యువతిని లాక్కెళ్లి...: సీరియల్ రేపిస్ట్స్ అరెస్ట్, 8మంది స్త్రీలపై కిరాతకం
వడోదర/హైదరాబాద్: వడోదర గ్రామీణ పోలీసులు ఆరుగురుతో కూడిన సీరియల్ రేపిస్ట్ గ్యాంగ్ ముఠాను అరెస్టు చేశారు. వారు మొత్తం ఏడుగురు ఉన్నారు. 18 ఏళ్ల యువతి పైన షినోర్తలుకలో గత వారం వారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు సభ్యులు కలిగిన గ్యాంగ్లో ఆరుగురుని అరెస్టు చేశారు.
నిందితులు లేబర్ పని చేస్తున్నారు. తాము గత ఆరు నెలలుగా దాదాపు ఎనిమిది మంది పైన అత్యాచారానికి పాల్పడ్డామని, పలువురిని వేధించామని వారు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నిందితులు షినోర్ సమీపంలోని రెండు గ్రామాలకు చెందినవారు.
జనవరి 17వ తారీఖున వారు 18 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ఆమె తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ చేశారు. దాదాపు కిలోమీటరున్నర దూరం ఆమెను లాక్కెళ్లారు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను మహేష్, నితేష్, మహేష్, రంజిత్, రాజేష్, ఘనశ్యామ్లుగా గుర్తించారు. ఏడో నిందితుడిని అరెస్టు చేయవలసి ఉంది.