మెట్రో రైలుకూ అడ్డం పడ్డ ప్రబుద్ధుడు: తృటిలో తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లకే అనుకుంటే.. మెట్రో రైలుకు కూడా అడ్డం పడ్డాడో ప్రబుద్ధుడు. కాకపోతే- తృటిలో ప్రాణాలతో బయటపడ గలిగాడు. మెట్రో స్టేషన్ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి, అతణ్ని రైలు కింద పడకుండా పక్కకు లాగేశారు. దేశ రాజధానిలోని యమునా బ్యాంక్-వైశాలి సెక్షన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా- బ్లూ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. బ్లూ లైన్ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అంటూ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వెల్లడించింది.
రైతాంగానికి చేదు వార్త: వారం ఆలస్యంగా నైరుతి!
ఢిల్లీ నగర శివార్లకు ఆనుకుని ఉండే ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్ కౌశంబి స్టేషన్లో ఈ ఉదయం 9:50 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు డీఎంఆర్సీ పేర్కొంది. ఈ ఉదయం కౌశంబి స్టేషన్కు వచ్చిన గుర్తు తెలియని యువకుడొకడు.. రైలు బయలుదేరే సమయానికి అందులో నుంచి పట్టాల పైకి దూకేశాడు. ద్వారకా వైపునకు బయలుదేరడానికి కదిలిన సమయంలో అనూహ్యంగా ఆ యువకుడు పట్టాలపైకి దూకాడు.
మహిళల కోసం కేటాయించిన ర్యాక్, దాని వెనుక ర్యాక్ మధ్య స్థలంలో ఇరుక్కుపోయాడు. అతణ్ని గుర్తించిన వెంటనే- స్టేషన్ సిబ్బంది రైలును ఆపేశారు. ర్యాక్ ల మధ్య ఇరుక్కున్న అతణ్ని అతి కష్టం మీద బయటికి లాగారు. ఆ వెంటనే పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వల్ల బ్లూ లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలు జాప్యం ఏర్పడినట్లు డీఎంఆర్సీ వెల్లడించింది.
Blue Line Update
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) May 15, 2019
Delay in services between Yamuna Bank and Vaishali due to a person on track at Kaushambi.