వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఘోర రోడ్డు ప్రమాదం... ట్రక్కును ఢీకొట్టిన బస్సు... ఏడుగురు మృతి...
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున రాయ్పూర్లోని చెరీ ఖేడీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా వలస కార్మికులేనని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఆ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్లోని సూరత్కు వలస కార్మికులను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాయ్పూర్ ఎస్ఎస్పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ... ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా,మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
Recommended Video
Floods:
ప్రమాదకరస్థాయిలో
రామప్ప
చెరువు,కోనా
రెడ్డి
చెరువు
కు
గండి
!
పోటెత్తుతున్న
వరద
నీరు...!!
బస్సును ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
In a tragic incident, at least seven labourers were killed and several others were gravely injured after a bus-truck collision in Raipur, Chhattisgarh on Saturday (September 5) morning. The bus was carrying labourers ferrying them to Surat in Gujarat from Ganjam in Odisha.
Story first published: Saturday, September 5, 2020, 10:37 [IST]