భక్తులకు హుండీ డబ్బుల పంపిణీ.. అనాదిగా ఆచారం.. తొక్కిసలాటలో ఏడుగురు మృత్యువాత
తిరుచ్చి : తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆనాదిగా వస్తున్న ఆచారం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. తిరుచ్చిలోని తురయార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ముత్యంపాలయంలో ఉన్న కరుప్పన స్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయితే తరతరాలుగా కొనసాగుతున్న హుండీ డబ్బుల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. నలుగురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 10 మంది వరకు గాయాలపాలయ్యారు.
కాదేదీ అక్రమ నగదు రవాణాకు అనర్హం.. కారు టైరులో 2 కోట్లు తరలింపు (వీడియో)
చైత్ర పౌర్ణమి ఉత్సవాల సందర్భంలో ప్రతి ఏటా ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే హుండీలోని చిల్లర నాణాలను భక్తులకు పంపిణీ చేస్తుంటారు ఆలయ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో నిల్చున్న భక్తులు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒకరిపై మరొకరు పడటంతో తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది.
చనిపోయినవారిలో ఆర్.లక్ష్మికాంతన్ (60), కె.రాజవేల్ (55), ఎస్.గాందాయి (38), ఎ.శాంతి (50), రామర్ (50), వి.పుంగవనం (50), ఆర్.వల్లి (35) ఉన్నారు. వీరంతా కరూర్, కడలూర్, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందినవారుగా అధికారులు గుర్తించారు.