మావోల మెరుపు దాడిలో ఏడుగురు జవాన్ల మృతి
బంగారం పట్టివేత
రెండున్నర కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్ నుంచి 2.5 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు వీరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
నేతలపై ఎఎపి
రాజకీయ పార్టీల నేతలందర్నీ రిలయన్స్ గుప్పిట్లో పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ఆరోపించింది. హైదరాబాదులో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ.. కెజి బేసిన్ ధరలపై రిలయన్స్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలపై 4 వేల కోట్ల రూపాయల భారం పడే గ్యాస్ ధరల పెంపు ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కెజి బేసిన్ గ్యాసుపై ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని? అన్ని పార్టీలు ముఖేష్ అంబానీకి అమ్ముడు పోయాయా? అంటూ నిలదీశారు.