వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ రాకెట్ షాక్: అమ్మాయిల్ని అమ్మి రూ.100 కోట్లు సంపాదించిన జంట

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అమ్మాయిల అక్రమ రవాణా, సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ జంటతో పాటు మరో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది పైన పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ కీలక సూత్రదారులు హుస్సేన్, సైరాలుగా పోలీసులు గుర్తించారు.

ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్నాటక, అసోం తదితర రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి దాదాపు ఐదు వేల మంది అమ్మాయిలను వీరిద్దరు ఢిల్లీకి అక్రమంగా తరలించేవాళ్లు. రూ.50వేలకు అమ్మాయిని కొనడం, రూ.2 లక్షలు అంతకు పైగా అమ్మేయడం చేసేవారు. వీరు కూడా రాకెట్ నడిపేవారు.

Sex racket busted in Delhi, eight booked

ఈ వ్యాపారంతో వీరు ఇప్పటి దాకా రూ.100 కోట్లు ఆర్జించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అమ్మాయి వయస్సు ఎంత తక్కువగా ఉండే వీళ్లకు అంత ఎక్కువ డబ్బులు వచ్చేవని తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

కొందరు అమ్మాయిలను తీసుకు వచ్చి మేనేజర్లకు అమ్మేవారు. ఈ మేనేజర్లు, మరికొందరి ద్వారా సైరా భానుకు అమ్మాయిలను అమ్మేవారు.

వీరిని మెయింటెయిన్ చేసే బాధ్యతలను సైరా ఇంకొందరు అమ్మాయిలకు అప్పగించేది. అమ్మాయిలను అల్మరాల్లోనూ, షెల్ఫ్‌లలోను దాచి ఉంచేవారు. విటుల వద్దకు వారే పంపేవారు. ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలు ఉండేవి. ఇలా వీరు వంద కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం.

English summary
Child trafficking racket busted in Delhi, eight arrested including couple that headed the syndicate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X