ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలిని నగ్నంగా ఫోటోలు తీసి అతను ఏం చేశాడంటే
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన స్నేహితులరాలిని నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించిన విధ్యార్థిని గురుగావ్ పోలీసులు అరెస్టు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
గురుగ్రామ్ :ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలికి మత్తు మందు కలిపి కూల్ డ్రింక్ ఇచ్చి నగ్నఫోటోలు తీసిన కేసులో బిసిఏ విధ్యార్థి ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హర్యానాలోని గురుగ్రామ్ లోని ఈ ఘటన చోటుచేసుకొంది. కొన్ని నెలల క్రితం అమిత్ కుమార్ కు ఫేస్ బుక్ ద్వారా 22 ఏళ్ళయువతి పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ స్నేహితులయ్యారు. వారి పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఆమె మంగళవారం నాడు అమిత్ కుమార్ ఇంటికి చేరుకొంది.
అమిత్ ఇంటికి వచ్చిన యువతిని అతడు మోసం చేశాడు. అమిత్ తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొన్న అమిత్ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపాడు , ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఆమె దుస్తులను తొలగించి నగ్నంగా ఆమె ఫోటోలను , వీడియోలను తన ఫోన్ లో రికార్డు చేశాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహాలోకి వచ్చింది. ఆమెతో అమిత్ అ2సభ్యంగా ప్రవర్తించాడు. విషయం బయటకు చెబితే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరించాడు. బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది. వారి సహయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.