పబ్ లో పీకలదాక మద్యం తాగిన సీఈవో: యువతి మీద అక్కడ చేతులు వేశాడు, చివరికి !
పబ్ లో పీకలదాక మద్యం సేవించిన ప్రైవేట్ కంపెనీ సీఈవోస్నేహితుడితో కలిసి వచ్చిన యువతి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడుపబ్ లో సీసీకెమెరాలు పరిశీలించిన బెంగళూరు పోలీసులు, అరెస్టు చేసి జైల్లో వేశారు
బెంగళూరు: స్నేహితులతో కలిసి పీకలదాక మద్యం సేవించి అక్కడే ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రైవేట్ కంపెనీ సీఈవోను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీ సీఈవో మనీష్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు చెప్పారు.
ఆదివారం రాత్రి బెంగళూరులోని దోమ్మలూరులోని ఓ పబ్ కు మనీష్ తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. తరువాత స్నేహితులతో కలిసి పీకలదాక మద్యం సేవించాడు. మనీష్ స్నేహితుడితో కలిసి ఓ యువతి పబ్ కు వెళ్లింది. ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న మనీష్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
యువతి మీద చెయ్యి వేసిన మనీష్ ఆమెను లైంగికంగా వేధించాడని సమాచారం. యువతి అభ్యంతరం చెబుతున్నా ఆమె శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో హలసూరు పోలీసులు దోమ్మలూరులోని పబ్ కు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. యువతి పట్ల సీఈవో అసభ్యంగా ప్రవర్తించాడని రుజువు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం మనీష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.