సునందపుష్కర్ మృతిలో ట్విస్ట్, సంచలనం: ఎవరి ఒత్తిడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం సంచలన ప్రకటన చేసింది. కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ గత ఏడాది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఎయిమ్స్ ప్రకటన చేసింది. సునంద పుష్కర్ది సహజ మరణమని తమతో చెప్పించారని ఫోరెన్సిక్ విభాగాధిపతి తెలిపారు. ఒత్తిళ్ల వల్లే తాము అలా చెప్పాల్సి వచ్చిందన్నారు.
సానుకూల నివేదిక కోసం ప్రభుత్వం అప్పుడు తమ పైన ఒత్తిడి తెచ్చిందన్నారు. సహజ మరణమని ఇవ్వాల్సిందిగా తమ పైన ఒత్తిడి తెచ్చారన్నారు.
ఒత్తిడి తెచ్చినందు వల్లే తాము అలా నివేదిక ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కాగా, ఎయిమ్స్ సంచలన ప్రకటన నేపథ్యంలో ఎవరి ఒత్తిడి చేశారనే అంశం తెర పైకి వచ్చింది. కాగా, సునంద పుష్కర్ మృతి పైన కేంద్రమంత్రి హర్షవర్ధన్ తాజా నివేదిక కోరారు.
కాగా, నాటి కేంద్రమంత్రి సునంద పుష్కర్ గత ఏడాది ఓ హోటల్లో విగత జీవిగా కనిపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జర్నలిస్టుతో శశిథరూర్ విషయమై ఆమె మాట్లాడిన మరుసటి రోజే మృతి చెంది కనిపించడం అప్పుడు అనుమానాలకు తావిచ్చింది.