షీనా కేసులో ట్విస్ట్: 'నాకు నిజాలు తెలుసు, అన్నీ చెప్పేస్తా'
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. కేసులో మరింత పురోగతి వస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న విచారణ ఖైదీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంరాయ్ అప్రూవర్గా మారాడు.
కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు కోర్టు ముందు ఉంచుతానని చెప్పారు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసునని, ఈ హత్యలో తాను కూడా ఓ భాగస్వామిని అని చెప్పాడు. షీనాను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు తెలిపాడు.
ఇంద్రాణీకి మరిన్ని చిక్కులు: పెదవి విప్పిన షీనా ఓనర్
గత వారం శ్యాంరాయ్ న్యాయస్థానానికి రెండు పేజీల లేఖ రాశాడు. తాను కేసు గురించిన అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పాడు. తనకు కేసులో క్షమాభిక్ష కావాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ నేపథ్యంలో బుధవారం కోర్టుకు డ్రైవర్ శ్యాంరాయ్ కొన్ని విషయాలు చెప్పాడు. తనకు హత్య గురించి తెలుసునని చెప్పాడు. తాను ఎవరి నుంచో వచ్చిన ఒత్తిడి వల్ల ఇవి చెప్పడం లేదని తెలిపాడు. అనంతరం కేసు మే 17వ తేదీకి వాయిదా పడింది.