షీనా హత్య: 'మా సాయంతో ఇంద్రాణి గొంతు పిసికింది'
ముంబై: షీనా బోరా హత్య కేసు పైన డ్రైవర్ శ్యామ్ రాయ్ విచారణలో పలు విషయాలను వెల్లండిచాడు. షీనా గొంతును ఇంద్రాణి పిసికిందని చెప్పారు. అయితే, పీటర్ పైన ఆయన మౌనం వహించినట్లుగా తెలుస్తోంది. శ్యాం రాయ్ కొద్ది రోజుల క్రితం అప్రూవల్గా మారిన విషయం తెలిసిందే.
షీనా కేసులో ట్విస్ట్: 'నాకు నిజాలు తెలుసు, అన్నీ చెప్పేస్తా'
షీనా హత్య కేసులో ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని అంగీకరించాడు. 2012 ఏప్లిల్ 24వ తేదీన కారులో షీనాను చంపినట్లు చెప్పాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జుత్తు పట్టుకొని కదలకుండా పట్టుకున్నాడని, ఇంద్రాణి తన చేతులతో షీనా గొంతు పిసికిందని చెప్పాడు.
షీనా హత్య కేసులో కీలకమలుపు: అప్రూవర్గా డ్రైవర్
పీటర్ ముఖర్జియా ప్రమేయం గురించి మాత్రం ఏమీ వెల్లడించలేదు. ఈ హత్యతో పీటర్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది చెబుతున్నారు. కాగా, షీనా హత్య కేసులో ఇంద్రాణి, శ్యాం రాయ్, ఖన్నాలను పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు.