వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌నాథ్‌తో షీలా దీక్షిత్ భేటీ: రాజీనామా చేస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఆమె రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. రాజీనామా చేయడానికి సిద్ధపడే ఆమె రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే, ఆ ప్రచారాన్ని షీలా దీక్షిత్ ఖండించారు.

తాను రాజీనామా చేస్తాననేది పుకారు మాత్రమేనని, వాస్తవం వెలుగు చూసేవరకు ఊహాగానాలకు అవకాశం ఇద్దామని ఆమె అన్నారు. రాష్ట్రపతిని కలుస్తారా అని అడిగితే - ఎల్లవేళలా రాష్ట్రపతిని కలుస్తానని, రాష్ట్రపతిని కలుసుకోవడం తన బాధ్యత అని ఆమె అన్ారు.

Sheila Dikshit meets Home Minister, denies reports about resigning

రాష్ట్రపతిని కలిసి షీలా దీక్షిత్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్‌నాథ్ సింగ్‌తో ఆమె 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను కేరళ గవర్నర్‌గా కొనసాగే విషయంపై మాట్లాడినట్లు సమాచారం.

గత యుపిఎ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌గా నియమించింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్ల స్థానంలో ఎన్డియె ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఆదివారంనాడు మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ కూడా రాజీనామా చేశారు.

English summary
Amid reports that she may be shunted out of Kerala, governor Sheila Dikshit on Monday met home minister Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X