నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం
అమృత్సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శిల్పాశెట్టి, ఆమె భర్త అమృత్సర్ నుండి జలందర్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బౌన్సర్ ఎదుటి కారు డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. అప్పుడు శిల్పాశెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ తర్వాత ఇరువర్గాలు పరిష్కరించుకున్నాయని తెలుస్తోంది. ఆ సమయంలో శిల్పాశెట్టి జలందర్లోని ఓ స్టోర్ను ప్రారంభించేందుకు కారులో వెళ్తున్నారు.