వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ దిష్టిబొమ్మ దహనం: మంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని సిమ్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.
ఈ క్రమంలో మోడీ దిష్టిబొమ్మపై కిరోసిన్ పోశారు. ఇంతలో ఒక కార్యకర్త సిగరెట్ లైటర్తో దిష్టిబొమ్మను వెలిగించాడు. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన మంటలు దిష్టిబొమ్మ చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం అంటుకున్నాయి.
ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు మంటలు వ్యాపించాయి. గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులు ఇందిరా గాంధీ మెడికల్ కళాశాలలో చేర్పించారు.
Comments
shimla congress workers burn injuries Fire narendra modi effigy సిమ్లా కాంగ్రెస్ కార్యకర్తలు గాయాలు నిప్పు నరేంద్రమోడీ దిష్టిబొమ్మ
English summary
Two Congress workers on Monday suffered severe burn injuries while party members were setting on fire a Modi effigy in Shimla. The incident occurred when one of the workers was pouring kerosene on the effigy while another immediately used a cigarette lighter to burn it.
Story first published: Monday, December 14, 2015, 18:36 [IST]