గుజరాత్ లో అడుగుపెట్టిన జపాన్ ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ
జపాన్ ప్రధాని షింజో అబె రెండు రోజుల గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి వచ్చిన అబెకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.
అహ్మదాబాద్: జపాన్ ప్రధాని షింజో అబె రెండు రోజుల గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి వచ్చిన అబెకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.
విమానం దిగగానే అబెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోడీ. ఇద్దరు నేతలు అక్కడి నుంచి నేరుగా రోడ్ షో నిర్వహించి మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు . జపాన్ ప్రధాని షింజో అబెకు 9 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది స్వాగతం పలికారు.
Japanese PM Shinzo Abe, his wife Akie Abe and PM Narendra Modi at Sabarmati Ashram in Ahmedabad. pic.twitter.com/I6yPNEqvCj
— ANI (@ANI) September 13, 2017
డప్పులు, నృత్యాలతో సాంప్రదాయ రీతిలో ఇరు దేశాల ప్రధానులను గ్రీట్ చేశారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆశ్రమ విశేషాలను మోడీ.. అబెకు వివరించారు.
PM Modi & Japanese PM Shinzo Abe's road show to Sabarmati Ashram in Ahmedabad, begins. pic.twitter.com/QJGpkIkdVg
— ANI (@ANI) September 13, 2017
విమానం దిగే సమయంలో సూట్ వేసుకొని కనిపించిన అబె.. ఓపెన్ టాప్ జీపులో మాత్రం భారత సాంప్రదాయ కుర్తాలో కనిపించడం విశేషం. అబె ఇండియాకు రావడం ఇది నాలుగోసారి. మోడీ ఇవాళ రాత్రి అబెకు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.
#WATCH: PM Narendra Modi receives Japanese PM Shinzo Abe & his wife Akie Abe at Ahmedabad Airport. pic.twitter.com/Sui3i6jYdi
— ANI (@ANI) September 13, 2017
Gujarat: PM Narendra Modi receives Japanese PM Shinzo Abe and his wife Akie Abe at Ahmedabad Airport. pic.twitter.com/0ZOAROdDaN
— ANI (@ANI) September 13, 2017
తన ఫేవరెట్ వంటకాలతో జపాన్ ప్రధానికి విందు ఇవ్వనున్నారు. రేపు షింజో అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్ సాయంతో రానున్న ఈ బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది.