వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రే

|
Google Oneindia TeluguNews

రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన యూపిలోని రాంమందిరాన్ని శివసేన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో కలిసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడీయాతో మాట్లాడారు.

2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే అయోధ్య ను సందర్శించానని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.కాగా ఇదివరకే ఉద్దవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి రాంమందిర నిర్మాణం చేపట్టాని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు.

 Shiv Sena chief Uddhav Thackeray offered prayers at the makeshift Ram Lalla temple

ఇక తాజాగా మరోసారి అనగా నేడు 18మంది ఎంపీల బృందంతో కలిసి రామాలయాన్ని ఉద్దవ్ ఠాక్రే సందర్శించాడు.దీంతో రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తేనున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. మందిరాన్ని నిర్మించాలని ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మరోవైపు మహరాష్ట్ర్రలో వచ్చే ఎన్నికలు ఉండడం కూడ శివసేన పావులు కదుపుతోంది.

కాగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో సైతం రామమందిర నిర్మాణం చేపడతామని పేర్కోంది. ఇక రామ మందిర నిర్మాణ వివాదం సుప్రిం కోర్టు ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే..మందిర నిర్మాణంపై మధ్యవర్తుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని కూడ కోర్టు సూచించింది. కాగా గత 50 సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగ రాసిన బీజేపీ స్వంతగానే 303 స్థానాలు సాధించింది. దీంతో ఆ పార్టీ రామ మందిర నిర్మాణంపై ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్దమవుతుంది.

English summary
Shiv Sena chief Uddhav Thackeray offered prayers at the makeshift Ram Lalla temple in Ayodhya in Uttar Pradesh on Sunday along with 18 party MPs.Uddhav Thackeray arrived in Ayodhya this morning along with his son Aditya and met party MPs who are in the town since Saturday evening. He then paid obeisance at the makeshift temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X