ముంబాయి మేయర్ గా విశ్వనాథ్ మహదేశ్వర్ ఎన్నిక, శివసేనకు బిజెపి మద్దతు
ఆసియాలో అత్యంత ధనిక నగర పాలక సంస్థగా పేరొందిన ముంబాయి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక బుదవారం నాడు పూర్తైంది. బుదవారం నాడు జరిగిన ఈ ఎన్నికల్లో శివసేనకు చెందిన విశ్వనాథ్ మహదేశ్వర్ ఎన్నికయ్యారు.
ముంబయి:ఆసియాలోనే అత్యంత ధనికవంతమైన బృహణ్ ముంబాయికి కొత్త మేయర్ గా విశ్వనాథ్ మహదేశ్వర్ ఎన్నికయ్యారు. శివసేన తన అభ్యర్థిగా విశ్వనాథ్ మహదేశ్వర్ ను ఎంపిక చేసింది. అతి పెద్ద పార్టీగా శివసేన అవతరించడంతో బిజెపి శివసేనకు మేయర్ ఎన్నికల్లో మద్దతిచ్చింది.దీంతో శివసేనకు చెందిన విశ్వనాథ్ మహదేశ్వర్ మేయర్ గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో శివసేనకు ఎక్కువ సీట్లు వచ్చాయి.బిజెపి కంటే ఎక్కువ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకొంది. బిజెపి మేయర్ అభ్యర్థిగా తాము బరిలో నిలవబోమని ఆ పార్టీ ప్రకటించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొన్న శివసేనకు మద్దతిచ్చేందుకు బిజెపి ముందుకు వచ్చింది.
దీంతో శివసేన మేయర్ అభ్యర్థిగా విశ్వనాథ్ మహదేశ్వర్ ను ఎంపిక చేసింది.శివసేనకే మేయర్ ఎన్నికల్లో తాము మద్దతిస్తామని బిజెపి ప్రకటించింది. దీంతో శివసేన కు లైన్ క్లియర్ అయింది.
బుదవారం నాడు మేయర్ ఎన్నికను నిర్వహించారు. మేయర్ గా విశ్వనాథ్ మహదేశ్వర్ ఎన్నికయ్యారు. బిజెపి శివసేనకు మద్దతు ప్రకటించడంతో ఈ ఎన్నికకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగింది.