మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్ నాథ్, ఠాకేకు ఇష్టం లేదు, సినిమా!
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ శింధే ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శివసేన పార్టీ మరో సీనియర్ నాయకుడు సునీల్ ప్రభును ఆ పార్టీ చీఫ్ విప్ గా ఎన్నిక అయ్యారు. ఏక్ నాథ్ శింధే థాణే నియోజక వర్గం శాసన సభ్యుడు. గత బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఏక్ నాథ్ శింధే మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. శివసేన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏక్ నాథ్ శింధే ఎన్నిక కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!
ఠాక్రేకు ఇష్టం లేదు
శివసేన పార్టీ నాయకులు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆదిత్య ఠాక్రేని ఎన్నుకోవాలని అనుకున్నారు. అయితే తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను శాసనసభాపక్ష నేతగా ఎంపిక చెయ్యడం శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి ఏమాత్రం ఇష్టం లేదని పార్టీ సీనియర్ నాయకులు కొందరు అన్నారు.
ఆదిత్య ఠాక్రే నిర్ణయం
శివసేన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏక్ నాథ్ శింధే పేరును స్వయంగా ఆదిత్య ఠాక్రే ప్రతిపాధించారు. మరోనేత ప్రతాప్ సర్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఆదిత్య ఠాక్రే ప్రతిపాదనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు పలికి ఏక్ నాథ్ శింధేని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దాదర్ లో మీటింగ్
ముంబైలోని దాదర్ లో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే హాజరైనారు. శివసేన పార్టీకి మద్దతు ఇచ్చే కొందరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ సమావేశంలో హాజరైనారు. శివసేన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు సైతం శివసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏక్ నాథ్ శింధేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సినిమా ఇంకా ఉంది!
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ,శివసేన పార్టీ నాయకులు నిర్ణయించారు. అయితే 50-50 ఫార్ములా విషయంలో బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు మొదలైనాయి. ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రుల విషయంలో బీజేపీ, శివసేన పార్టీ నాయకుల మధ్య ఇంకా చర్చలు పూర్తి కాలేదు.