వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ రాజకీయాలు దేశాన్ని ముంచుతాయి: శివసేన ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: భారతీయ జనతా పార్టీ పైన ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన మండిపడింది. బీజేపీ రాజకీయాలు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ధ్వజమెత్తారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌తో కుమ్మక్కై జమ్మూ కాశ్మీర్‍‌లో అధికారం కైవసం చేసుకోవడానికి ఆడిన రాజకీయాలు సరికాదన్నారు.

 Shiv Sena slams BJP on sharing power with PDP in Jammu & Kashmir

పీడీపీతో పొత్తు బీజేపీతో పాటు దేశాన్ని నట్టేట ముంచుతాయని హెచ్చరించారు. ఆదివారం ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయం రాసింది. అందులో బీజేపీ పైన నిప్పులు చెరిగింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నిక్లలో పాకిస్తాన్, ఉగ్రవాదులు సహకరించారని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి దేశ ప్రజలను అవమానించారన్నారు.

అఫ్జల్ గురు అవశేషాలు కోరిన పీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రధాని మోడీ పార్లమెంటులో ఖండించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రయత్నించిన రామ్ మాదవ్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అడ్డుకోలేకపోతున్నారన్నారు.

English summary
Shiv Sena slams BJP on sharing power with PDP in Jammu & Kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X