వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడు మామూలోడు కాదు, పెద్ద తోపు, ఒకేసారి 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు లూటీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొంత మంది పోలీసులు అమాయకులకు మస్కా కొడుతుంటే ఓ కిలాడీ తోపుగాడు ఏకంగా 23 మంది పోలీసులకు సినిమా చూపించాడు. ఏకంగా ఒకే సారి 23 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్ మొబైల్ ఫోన్లు చోరీ చేసి పోలీసులకు చుక్కలు చూపించాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు వీడు మామూలోడు కాదు, పెద్ద కేటుగాడు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!

తమిళ తంబి అతి తెలివి

తమిళ తంబి అతి తెలివి

తమిళనాడుకు చెందిన కార్తీక్ (34) అనే వ్యక్తిని అరెస్టు చేసిన శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులు 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 10 విలువైన మొబైల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు కార్తీక్ ఎలా ఒకే సారి చోరీ చేశాడు అనే విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ కు గురైనారు.

 హింధూ మహాసభ

హింధూ మహాసభ

2019 సెప్టెంబర్ 12వ తేదీన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో హింధూ మహాసభా నిర్వహకులు పెద్ద ఎత్తున వినాయక చవితి పండుగ నిర్వహించారు. అదే సమయంలో హింధూ మహాసభ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది.

 లక్షల మంది భక్తులు

లక్షల మంది భక్తులు

లక్షలాధి మంది భక్తులు పాల్గొన్న వినాయక నిమజ్జనం ఊరేగింపుకు అదనపు పోలీసు బలగాలను భద్రత కోసం నియమించారు. ఆ సమయంలో భద్రతా ఏర్పాటు చెయ్యడానికి వెళ్లిన పోలీసులు శివమొగ్గలోని కళ్యాణమండపంలోని సముధాయ భవనంలో బస చేశారు.

లగేజ్, మొబైల్ ఫోన్లు

లగేజ్, మొబైల్ ఫోన్లు

సముధాయ భవనంలో పోలీసులు వారి లగేజ్ తో పాటు విలువైన మొబైల్ ఫోన్లు అక్కడే పెట్టి వినాయక నిమజ్జనం భద్రతా ఏర్పాట్లకు వెళ్లారు. వినాయక నిమజ్జనం పూర్తి అయిన తరువాత మరుసటి రోజు వేకువ జామున 2 గంటల సమయంలో పోలీసులు కళ్యాణమండపంలోని సముధాయ భవనం చేరుకున్నారు.

 పోలీసులకే సవాల్

పోలీసులకే సవాల్

సముధాయ భవనంలోని లగేజ్ తోపాటు అక్కడ ఉన్న 23 విలువైన మొబైల్ ఫోన్లో చోరీ అయిన విషయం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. ఒక్క సారిగా 23 మంది పోలీసుల మొబైల్ ఫోన్లు చోరీ కావడంతో పోలీసు శాఖ ఈ కేసును సవాలుగా స్వీకరించారు. అనేక మంది పోలీసుల విలువైన మొబైల్ ఫోన్ల లోకేషన్స్ పై నిఘా వేశారు.

తమిళనాడులో జల్సాలు

తమిళనాడులో జల్సాలు

తమిళనాడులో తలదాచుకుని జల్సాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కార్తీక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతను తెలిపిన వివరాల ఆధారంగా 13 విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్తీక్ మిగిలిన 10 మొబైల్ ఫోన్లు ఏం చేశాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Karnataka: Shivamogga Doddapete police arrested 34 year old Karthik who stolen 23 mobile of police officers. 13 mobile recovered from accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X