Shock:బ్యాంక్ కు వెళ్లిన మహిళ, 7 మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్, కొడుకు ఏడ్చాడని చంపేశారు,చనిపోయిందని !
పాట్నా/ బీహార్/ న్యూఢిల్లీ: వివాహిత మహిళపై కొందరు కామాంధులు చాలా కాలం నుంచి కన్ను వేశారు. చాన్స్ చిక్కితే ఆ మహిళను అనుభవించాలని కామాంధులు వేచిచూశారు. బ్యాంకు లావాదేవీల కోసం వెళ్లిన వివాహిత మహిళ పని ముగించుకుని తిరిగి ఇంటికి వెలుతున్న సమయంలో ఫాలో అయిన 7 మంది కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. కామం తీర్చుకుంటున్న సమయంలో మహిళ కొడుకు కేకలు వెయ్యడంతో సహనం కోల్పోయిన కిరాతకులు ఆ బాలుడిని చెరువులో వేసి హత్య చేశారు. మహిళ చనిపోయిందని భావించి కామాంధులు పరారైనారు.
Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!
మహిళపై కామాంధుల కన్నుపడింది
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయవేడి విపరీతంగా పెరిగిపోయింది. బీహార్ రాజధాని పాట్నాకు 135 కిలోమీటర్ల దూరంలోని బక్సార్ నియోజక వర్గంలోని గ్రామంలో 28 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చూడటానికి అందంగా ఉంటున్న వివాహిత మహిళపై కొందరు కామాంధులు చాలా కాలంగా కన్ను వేశారు.
చాన్స్ కోసం వెయిటింగ్
వివాహిత మహిళను అనుభవించాలని కొందరు కామాంధులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. మంచి చాన్స్ చిక్కితే ఆమెను లొంగదీసుకోవాలని, లేదంటే బలవంతంగా అయినా ఆమెను అనుభవించాలని కామాంధులు డేగల్లాగా వేచిచూశారు. వివాహి మహిళ మాత్రం కామాంధులకు లొంగలేదని తెలిసింది.
బ్యాంక్ లో పని కోసం వెళ్లింది
బ్యాంకులో లావాదేవీల కోసం వివాహిత మహిళ 5 ఏళ్ల కొడుకుని పిలుచుకుని వెళ్లింది. బ్యాంకులో పని ముగించుకున్న తరువాత ఆమె కొడుకుతో కలిసి ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో చెరువు సమీపంలోని నదీకాలవ దగ్గర 7 మంది కామాంధులు ఆమెను అడ్డుకున్నారు. కామాంధుల నుంచి తప్పించుకోవడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది.
కొడుకును చంపేసి సామూహిక అత్యాచారం
కామాంధులు ఆమె కొడుకును పక్కకు నెట్టేసి ఆమెను నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి 7 మంది కామాంధులు ఒకరి తరువాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు. బాలుడు భయంతో కేకలు వెయ్యడంతో సహనం కోల్పోయిన నిందితులు బాలుడిని చెరువులోకి విసిరేశారు. చెరువులో పడిన బాలుడు ఊపిరిఆడక ప్రాణాలు వదిలేశాడు. 7 మంది ఒకరి తరువాత ఒకరు పదేపదే అత్యాచారం చెయ్యడంతో వివాహిత మహిళ స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన కామాంధులు చెరువు గట్టు పొదల్లో విసిరేసి అక్కడి నుంచి పరారైనారు.
నాన్నా ఇది జరిగింది
రాత్రి వివాహిత మహిళ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రితో పాటు బంధువులు ఆందోళన చెందారు. మరుసటి రోజు వేకువజామున మహిళ తండ్రితో పాటు బంధువులు గాలించగా చెరువు గట్టు సమీపంలోని పొదల్లో ఆమె నగ్నంగా స్పృహ కోల్పోయిన స్థితిలో కనపడింది. అదే సమయంలో మహిళ కొడుకు చెరువులో శవమై కనిపించాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె జరిగిన విషయం తండ్రికి వివరించడంతో షాక్ కు గురైనారు.
Recommended Video
ఇద్దరు తెలిసినవాళ్లే
తన మీద 7 మంది సామూహిక అత్యాచారం చేశారని, ఇద్దరు వ్యక్తులు మన గ్రామానికి చెందిన వారే అని బాధితురాలు తనకు చెప్పిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 7 మందిలో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన ఆరు మంది తప్పించుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నదని, ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. 7 మంది కామాంధులు వివాహిత మహిళపై గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా ఆమె కొడుకు జలసమాధి చెయ్యడంతో బీహార్ లో కలకలం రేపింది.