చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: 15 ఏళ్ల అమ్మాయిపై 400 మంది రేప్, లైంగిక దాడి, లిస్టులో డాక్టర్లు, ఇన్స్ పెక్టర్లు, బీజేపీ లీడర్, వీఐపీలు, ఆంటీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ బెంగళూరు: అమ్మాయి వయసు కేవలం 15 ఏళ్లు. మైనర్ మీద 400 మందికి పైగా అత్యాచారం, లైంగిక దాడి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఓ రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి దారుణం జరడంతో ప్రజలు షాక్ అయ్యారు. అమాయకురాలైన అమ్మాయి మీద అత్యాచారం, లైంగిక దాడి చేసిన వారిలో పోలీసు ఇన్స్ పెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, పొలిటికల్ లీడర్స్, వీఐపీలు ఉన్నారని ఆరోపణలు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆంటీల స్కెచ్ తో అమ్మాయిపై జరిగిన అత్యాచారం కేసు ఉన్నతస్థాయి పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసు అధికారులు, పొలిటికల్ లీడర్స్, వీఐపీలు, పోలీసు అధికారులు అరెస్టు అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

 చెన్నై వాషర్ మెన్ పేట్ అమ్మాయి

చెన్నై వాషర్ మెన్ పేట్ అమ్మాయి

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని వాషర్ మెన్ పేట్ లో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి అమాయకురాలు. అమాయకురాలైన అమ్మాయి మీద అనేక మంది కామాంధుల కన్ను పడింది. అమ్మాయికి పరిచయం ఉన్న షకీరా బాను అనే మహిళ ఆమె జీవితాన్ని నాశనం చెయ్యాలని కొందరితో కలిసి స్కెచ్ వేసింది.

తల్లి ఫిర్యాదుతో కలకలం

తల్లి ఫిర్యాదుతో కలకలం

అమాయకురాలైన బాలిక పదేపదే అనారోగ్యానికి గురి కావడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చింది. అమ్మాయికి ఆమె తల్లి వైద్యపరీక్షలు చేయించింది. వైద్యపరీక్షల్లో వైద్యులు చెప్పిన నిజాలు తెలుసుకున్న ఆమె తల్లి షాక్ కు గురైయ్యింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై న్యాయం చెయ్యాలని, కామాంధులను శిక్షించాలని అమ్మాయి తల్లి పోలీసు అధికారులను వేడుకుంది.

పోలీసు అధికారులు. బీజేపీ లీడర్ ?

పోలీసు అధికారులు. బీజేపీ లీడర్ ?


బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన షకీరా బానుతో పాటు సంధ్య, మదన్ కుమార్, ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పూహళేంది, రైల్వే ఉద్యోగి కాశ్వరన్, బీజేపీ నాయకుడు రాజేంద్రన్ తో పాటు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ఇదే కేసు విచారణలో బాలిక చెప్పిన నిజాలు, వాస్తవాలు తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

రిసార్టులో కామాంధులకు బాలిక బలి దానం

రిసార్టులో కామాంధులకు బాలిక బలి దానం

15 ఏళ్ల బాలికను నమ్మించిన షకీరా బాను ఆమెను ఈసీ రోడ్డులోని ఓ రిసార్టుకు తీసుకెళ్లి బంధించారు. తరువాత రిసార్టుకు వచ్చివెళ్లే వాళ్లు బాలిక మీద పదేపదే అత్యాచారం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు పరిశీలించిన పోలీసు అధికారులు షాక్ అయ్యారు. మేము చెప్పినవాళ్లకు పడక సుఖం ఇవ్వాలని షకీరా బాను, సంధ్య, మదన్ మోహన్, ఓ బీజేపీ నాయకుడు తదితరులు బాలికను బెదిరించారని, ఆమెకు డబ్బులు ఇస్తామని సంప్రదింపులు జరిపారని వారి మొబైల్ ఫోన్ లు పరిశీలించిన పోలీసు అధికారులు గుర్తించారు.

రేప్ కేసులో పోలీసు అధికారులు, డాక్టర్లు, వీఐపీలు ?

రేప్ కేసులో పోలీసు అధికారులు, డాక్టర్లు, వీఐపీలు ?

15 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారం కేసులో చాలా మంది పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే వాళ్ల పేర్లు బయటకు రావడం కలకలం రేపింది. పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పని చేస్తూ రిటైడ్ అయిన ఓ కామాంధుడితో పాటు ఇద్దరు పోలీసు ఇన్స్ పెక్టర్లు, ఇద్దరు డాక్టర్లు, రాజకీయ నాయకులు, వీఐపీలు, ఓ టీవీ చానల్ రిపోర్టర్ తో సహ ఇలా లెక్కలేనంత మంది ప్రముఖులు అమ్మాయిపై అత్యాచారం చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

పోలీసు కమిషనర్ షాక్

పోలీసు కమిషనర్ షాక్

చెన్నై వాషర్ పేట్ లోని 15 ఏళ్ల అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులోని నిందితుల పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో చెన్నై సిటీ పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ షాక్ అయ్యారని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో ఇంకా ఎంతమంది వీఐపీలు ఉన్నారు ? అనే విషయం పూర్తిగా బయటకు లాగాలని పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ విచారణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

Recommended Video

Sushant గురించి మాట్లాడుతూ Heroine Sanjana లైవ్లో మేకప్.. నెటిజన్ల ట్రోల్స్ !
400 మంది అత్యాచారం !

400 మంది అత్యాచారం !


వాషర్ మెన్ పేట్ అమ్మాయి మీద వీఐపీలతో పాటు సుమారు 400 మంది అత్యాచారం, లైంగిక దాడి చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. అపార్ట్ మెంట్ లోని సెక్యూరిటీ గార్డులు, లిఫ్ట్ ఆపరేటర్లు, వాటర్ సప్లే చేసే వాళ్లు, పాలు సరఫరా చేసే వాళ్లు కూడా ఈ 15 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం, లైంగిక దాడి చేశారని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన కామాంధుల అరెస్టుకు రంగం సిద్దం అవుతోందని తెలిసింది. మొత్తం మీద 15 ఏళ్ల అమ్మాయి మీద 400 మంది అత్యాచారం, లైంగిక దాడి చేశారని వెలుగు చూడటం చెన్నై సిటీతో పాటు తమిళనాడులో కలకలం రేపుతోంది.

English summary
Shock: Chennai Washermenpet 15 year old girl Sexual harassment issue case in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X