వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులకు షాక్ : ఆసుపత్రి నుంచి ఐదుగురు ఖైదీల పరారీ, ఒకరు మరణశిక్ష ఖైదీ

బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బక్సర్: బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పరారైన ఖైదీలు అందరూ ఆరోగ్యం సరిగా లేని కారణంగా జైలులోని ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నవారు.

ఐదుగురు ఖైదీలు ఆసుపత్రిలోని బాత్రూం అద్దాలను పగలగొట్టి, అందులోంచి దూరి పారిపోయినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. పరారైన ఐదుగురిలో ఒకరు మరణశిక్ష విధింపబడిన ఖైదీ కాగా, మరో నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు.

Shock to Officials: Five Buxar jail prisoners escape from Hospital

పరారైన ఐదుగురు ఖైదీల పేర్లను అధికారులు వెల్లడించారు. బక్సర్ సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం వీరి పేర్లు.. ప్రదీప్ సింగ్, దియోదరి రాయ్, సోను పాండే, ఉపేందర్ సహ, సోను సింగ్.

మరోవైపు పారిపోయిన ఈ ఖైదీలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ఉద్ధృతం చేసినట్లు బక్సర్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నప్పటికీ... ఖైదీల ఆచూకీ మాత్రం దొరకలేదని సమాచారం.

English summary
Five prisoners escaped from Central Jail in Buxar, Bihar on late Friday night after which the police has issued high alert and cordoned off the area. The search is on to locate the absconding prisoners but no progress has been made so far. The five prisoners have been identified as Pradeep Singh, Sonu Pandey, Upendra Saah, Deodhari Rai and Sonu Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X