వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఐసిస్‌లో చేరిన వ్యాపారవేత్త కుటుంబం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరిన ఘటన కలకలంగా సృష్టించింది. ఇటీవల కేరళకు చెందిన పది మందిఐసిస్‌ సంస్థలో చేరిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

ముంబైకి చెందిన అబ్దుల్‌ మజీద్‌ అనే వ్యాపారవేత్త కుమారుడు అష్‌ఫక్‌ అహ్మద్‌, భార్య, పిల్లలు, సోదరులతో కలిసి ఐసిస్‌లో చేరిపోయాడు. అహ్మద్‌ తన కుటుంబంతో కలిసి జూన్‌లో విదేశాలకు వెళ్లాడు.

Shocking! 5 members of Mumbai businessman’s family joined ISIS, says report

ఆ తర్వాత అందరితో కలిసి ఉగ్రసంస్థలో చేరిపోయామని ఇంకెప్పుడూ భారత్‌కు తిరిగిరామని అహ్మద్‌ తన సోదరుడికి మెసేజ్‌ పెట్టాడు. దీంతో అహ్మద్‌ తండ్రి మజీద్‌ పోలీసులను ఆశ్రయించాడు.

కేరళలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రషీద్‌, ఇస్లాం మతగురువు హనీఫ్‌లు తన కుమారుడు అఫ్‌షక్‌తో కలిసి సిరియా వెళ్లాడని ఆ తర్వాత అతను తన కుమారుడి మనసు మార్చేసి ఐసిస్‌లో చేరేలా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబై పోలీసులు హనీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

English summary
Five members of a Mumbai-based businessman's family have reportedly joined the dreaded terror outfit, Islamic State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X