టెర్రరిస్ట్ల అరెస్ట్ ఎఫెక్ట్!: సోషల్ మీడియా, ఫోన్లు బ్యాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత జీవితంలో సాంకేతికత నిత్యకృత్యం అయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యువతతో పాటు చాలామంది ఉపయోగించుకుంటుంటారు. ప్రస్తుత ప్రపంచంలో ఇవి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉంది.
అయితే, అనూహ్యంగా హరిద్వార్లోని రూర్కీ మదర్సా అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. తమ విద్యార్థులు మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని మదర్సా నిషేధించింది. మొబైల్, సోషల్ మీడియా విషయంలో హద్దులో ఉండాలని అధ్యాపకులకు కూడా హెచ్చరించింది.
కాగా, ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇది జరిగిందని తెలుస్తోంది. సోషల్ మీడియా వలలో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లుగా మదర్సా చెబుతోందని తెలుస్తోంది.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లల మీద కన్నేసి ఉంచాలని, సాంకేతికత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అథారిటీకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు ఉగ్రవాదులను, సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.