షాక్: మెట్రో రైల్లో మూత్ర విసర్జన, వీడియోకి చిక్కాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో ఓ షాకింగ్! ఓ వ్యక్తి మెట్రో రైలులో మూత్రం పోస్తూ వీడియోకు చిక్కాడు. ఈ వీడియో సామాజిక అనుసంధాన వేదికలలో అప్ లోడ్ అయింది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మెట్రో రైలులో సదరు వ్యక్తి మూత్రం పోస్తుండగా గమనించిన ఒకతను దానిని వీడియోగా తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
ఈ విషయమై మూత్రం పోసిన వ్యక్తిని ఓ ప్రయాణీకుడు అడిగాడు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి స్పందిస్తూ.. ఇది తనకు చివరి రైలు అని, దీనిని మిస్ అయితే తనకు మరొకటి లేదని చెప్పాడు. మరో రైలు లేకపోవడంతో ఎక్కడం వల్లే ఇలా జరిగిందని సదరు వ్యక్తి అభిప్రాయం.
ఓ వ్యక్తి అతనిని హెచ్చరిస్తున్నప్పటికీ.. అతనిని లెక్క చేయకుండా సదరు వ్యక్తి తన పని తాని కానిచ్చేశాడు. కాగా, ఈ వీడియో తీసిన వ్యక్తి ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ హెల్ప్ లైన్కు సమాచారం అందించాడు. యూరిన్ పోసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.