వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పాక్ జెండాలు ఎగురేసినవారిని కాల్చిపారేయండి’

|
Google Oneindia TeluguNews

రాజ్‌కోట్: పాకిస్థాన్ అనుకూలవాదులపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్‌లో పాక్ జెండాలు ఎగురేస్తున్నవారిని కాల్చి చంపండని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పాక్ జెండాలు ఎగురేవేసి పాక్ అనుకూల నినాదాలు చేస్తున్నవారి ఛాతిలో తుపాకుల గుళ్లు దించాలని అన్నారు.

Pravin Togadia

కాశ్మీర్‌లో పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. వేర్పాటువాదులపై తగినస్థాయిలో చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవల పలుమార్లు పాకిస్థాన్ జెండాలు ఎగురవేసిన వేర్పాటువాదులు, పాక్ అనుకూల నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీతోపాటు పలువురు నేతలను పోలీసులు ఇంట్లోనే బంధించారు.

English summary
Accusing the Union government of not taking "stern action" against pro-Pakistani separatists, Vishwa Hindu Parishad (VHP) president Pravin Togadia on Saturday said those who hoist Pakistani flags in Kashmir must be "shot".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X