కశ్మీర్లో బీభత్సం: దుకాణాదారుడిపై ఆగంతకుల కాల్పులు, ఆస్పత్రికి తరలింపు
కశ్మీర్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో త్రాల్ వద్ద తుపాకీతో బీభత్సం సృష్టించారు. ఓ దుకాణాదారుడిపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరపడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరో తెలియాల్సి ఉంది. తామే కాల్పులు జరిపింది తామేనని ఇంతరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
కశ్మీర్ విభజన తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆడదా దడపా దాడులు చేస్తూ భయాందోళన కలిగస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామాలో గల త్రాల్ వద్ద బుధవారం దుండగులు రెచ్చిపోయారు. ఓ దుకాణాదారుడిని లక్ష్యంగా చేసుకున్నారు. అతన్ని పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు. దీంతో తీవ్ర రక్త్రస్రావమైంది. హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
దుకాణాదారుడిని మెహరాజ్గా పోలీసులు గుర్తించారు. అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరిలంచారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మెహరాజ్పై కాల్పులు జరిపిన దుండగులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కాల్పులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.