జర్నలిస్టు షుజాత్ను చంపింది కాశ్మీర్ పాకిస్తాన్ వ్యక్తులు: పోలీసులు
సీనియర్ జర్నలిస్ట్ రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ షుజాత్ బుఖారిని హత్య చేసింది కాశ్మీర్, పాకిస్తాన్లకు చెందిన వ్యక్తులని కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యిందని... నిందితులందరిని గుర్తించామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తి పాకిస్తాన్కు చెందిన నవీద్ జట్గా గుర్తించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
బుఖారీ కారులో తన నివాసానికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి కాల్పులు జరిపారు. బుఖారీ సెక్యూరిటీ గార్డులను కూడా దుండగులు హత్య చేశారు. శ్రీనగర్ డీఐజీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పడి కేసును దర్యాప్తు చేసింది. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి బుఖారి హత్యతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఘటనా స్థలం నుంచి, సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.
మూడు దశాబ్దాలుగా కాశ్మీర్ గొంతును వినిపిస్తున్న ఏకైక జర్నలిస్టు షుజాత్. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు షుజాత్ బుఖారీని తామే హత్య చేసినట్లు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయకపోవడం విశేషం.