బ్యూటీ పార్లర్లు మూసేయండి, లేదంటే లేపేస్తాం
జమ్మూ: బ్యూటీ పార్లర్లు మొత్తం మూసి వెయ్యాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హిజబుల్ మూజాహుద్దిన్ ఉగ్రవాదులు వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తు రాత్రికి రాత్రి పోస్టర్లు అతికించారు.
జమ్మూలోని పూల్వమా పట్టణంలోని అన్ని విద్యా సంస్థల వద్ద శుక్రవారం హిజబుల్ ముజాహిద్దిన్ సంస్థ పేరుతో పోస్టర్లు అతికించారు. అమ్మాయిలెవ్వరూ బురఖా లేకుండ బయటకు రావద్దని, బురఖా లేకుండ స్కూల్, కాలేజ్ లకు వెల్లరాదని, అలా చేస్తే మీ అంతు చూస్తామని హెచ్చరించారు.
బ్యూటీ పార్లర్లు మొత్తం 24 గంటలలో మూసి వెయ్యాలని వార్నింగ్ ఇచ్చారు. అలా చెయ్యని వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అమ్మాయిలు ఎవ్వరూ బ్యూటీ పార్లర్లకు వెల్లరాదని హెచ్చరించారు.
అంతే కాకుండ మద్యం, డ్రగ్స్ కు బానిసలైన మగవారు వెంటనే వారి అలవాట్లు మార్చుకోవాలని హెచ్చరించారు. చెడు అలవాట్లకు బానిసలైన వారిని అంతం చెస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులపై ఆంక్షలు విదించేవారిని వదిలి పెట్టమని, ప్రజలను భయపెడుతున్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తేజిందర్ సింగ్ తెలిపారు. గతంలో ఇలాంటి పోస్టర్లు అనేక సార్లు అంటించారు.