సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
కోల్కత్తా: మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూసారు. మదర్ థెరిస్సా మరణాంతరం చారిటీస్ బాధ్యతలను 1997లో స్వీకరించిన ఆమె, సంస్ధ కార్యకలాపాలను మరింతగా విస్తరించారు.
1997 -2009 వరకు మిషనరీ ఆఫ్ చారిటీస్ నిర్వహకురాలిగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు.
Saddened
at
the
passing
of
Sister
Nirmala
who
headed
Missionaries
of
Charity
after
Mother
Teresa.
Kolkata
and
the
world
will
miss
her
—
Mamata
Banerjee
(@MamataOfficial)
June
23,
2015
నేపాల్ నుంచి భారత్కు వచ్చిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన సిస్టర్ నిర్మల జులై 23, 1934న రాంచీలో జన్మించారు. 17 సంవత్సరాల వయసులోనే ఆమె ఆర్డర్లో చేరారు.
సిస్టర్ నిర్మల మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
మదర్ థెరిస్సా వారసురాలిగా మిషనరీస్ ఆప్ ఛారిటీ బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా పేదల కోసం, అనాథల కోసం సేవలందించిన సిస్టర్ నిర్మలను కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపాన్ని తెలిపారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహకురాలు నిర్మల మృతికి నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె నిస్వార్థపూరితమైన సేవా దృక్పథం యావత్ ప్రపంచానికే ఆదర్శనీయమైనవన్నారు.
My
deepest
condolences
to
the
Missionaries
of
Charity
family
on
the
passing
away
of
Sister
Nirmala.
—
Narendra
Modi
(@narendramodi)
June
23,
2015
Sister
Nirmala's
life
was
devoted
to
service,
caring
for
the
poor
&
underprivileged.
Saddened
by
her
demise.
May
her
soul
rest
in
peace.
—
Narendra
Modi
(@narendramodi)
June
23,
2015