ఒక్కరు కాదు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదస్థితిలో, మృత్యువాత
ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గంజాం జిల్లాలోని మాటియా బోరి గ్రామానికి చెందిన వీరు తురుబండిలో గల తాతయ్య వద్ద ఉంటున్నారు. బాలికల అమ్మ, నాన్న సొంత గ్రామంలో రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్నారు. తురుబండిలో ఉన్న వీరు శుక్రవారం అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది.
శుక్రవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఎల్ తిటికా రెడ్డి, ఎల్ సోమరెడ్డి చనిపోయారు. ఎల్ బర్షారెడ్డిని మాత్రం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లిన తర్వాత మృతిచెందారు. తిటికా, సోమరెడ్డి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. శుక్రవారం వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి తిటికా, సోమ వెళలిపోయారు. బర్షాను మాత్రం ఆస్పత్రికి తరలించగా చనిపోయారు.
అక్కాచెల్లెళ్ల మృతికి కారణం, వారు నిద్రిస్తోన్న గదిలో పెస్టిసైడ్స్ ఉండటమే కారణం కావొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదక వచ్చాక కారణం ఏంటో తెలుస్తోందని పోలీసులు చెప్తున్నారు.